దేశంలో నానాటికి కామాంధులు రెచ్చిపోతున్నారని ప్రతిరోజూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి నేరాగాళ్లపై ఫోస్కో, నిర్భయ చట్టాలు అమలు పరుస్తూ జైలుకు మాత్రం పంపుతున్నారు. అయితే సౌదీ దేశాల మాదిరి కఠిన చట్టాలు అమలు పర్చకపోవడం వల్ల ఒకరిన చూసి మరొకరు మృగాళ్లలా మారిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కృరమృగాళ్లలా వేటాడి అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ అరకు ప్రాంతంలో గిరిజన యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు.

అనంతరం బండరాయితో ఆమె తలపై మోది చంపేశాడు. తనతో పెళ్లికి నిరాకరించదన్న కోపంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఘటన అరకు మండలం శరభగూడ సీ.ఏ.హెచ్ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడు మహేశ్‌ పోలీసులకు లొంగిపోయాడు.  తాను ఆశించిన అమ్మాయి వేరేవారితో వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆ వ్యక్తి యువతిని కృరంగా అనుభవించి హత్య చేసినట్లు తెలిపాడు.

వివాహితుడైన మహేశ్‌ గత కొంతకాలంగా పుష్పను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న రాత్రి మాట్లాడేందుకు పిలిచి అత్యాచారం చేసి పుష్పను మహేశ్‌ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పుష్ప అత్యాచారం, హత్య విషయం తెలియగానే గ్రామస్థుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులతో పాటు స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఇలాంటి నింధితులకు మరణమే తుది నిర్ణయం అంటూ గ్రామస్తులు ఆవేశపడుతున్నారు. ఇలాంటి కామాంధుల వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పావలని..పోలీసుల జైలుకు పంపితే మళ్లీ వస్తాడని..అతన్న తమ సమక్షంలోనే శిక్షిస్తామని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మహేశ్‌కు తామే సరైన శిక్ష విధిస్తామన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: