వైఎస్ జగన్ మరొకొందరికి పదవులు కట్టబెట్టారు. కాకపోతే.. ఇవి అంత లాభదాయకం కాకపోయినా.. గుర్తింపు ఉండేవి. అవే అసెంబ్లీలో పలు కమిటీల ఛైర్మన్ పదవులు. వీటి నియామకం ఈరోజు పూర్తయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి కృష్ణమాచార్యులు ఉత్తర్వులు జారీచేశారు. రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులు ఆనం రాంనారాయణరెడ్డి, వెంకట చిన్నఅప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధర్‌రెడ్డి, బద్దుకొండ అప్పలనాయుడు, వల్లభనేని వంశీని నియామించారు.


ఇక వైసీపీలో ముందు నుంచి యాక్టివ్ గా ఉండి మీడియాలో కనిపించే అంబటి రాంబాబుకూ ఓ పదవి దక్కింది. అయన్ను అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా సభ్యులుగా చెన్నకేశవరెడ్డి, మొండితోక జగన్‌మోహన్‌రావు, రఘురామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.


ఆ తర్వాత పిటిషన్ కమిటీ.. ఈ పిటీషన్‌ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, కాసు మహేష్, ముదునూరి ప్రసాద రాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఏలూరి సాంబశివరావులను నియమించారు.


మరో కమిటీ సభాహక్కుల కమిటీ. ఈ సభాహక్కుల కమిటీకి చైర్మన్‌గా కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని నియమించారు. ఈ సభాహక్కుల కమిటీ సభ్యులుగా మల్లాది విష్ణు, వెంకట రమణ మూర్తి రాజు, చిన్న అప్పలనాయుడు, వర ప్రసాదరావు, శిల్పా చక్రపాణి, అనగాని సత్య ప్రసాద్‌లను నియమించారు.


మరో కీలక కమిటీ అయిన ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణను నియమించారు. సభ్యులుగా పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, అబ్బయ్య చౌదరి, మేడా వెంకట మల్లికార్జునరె డ్డి, అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్, పీ.జీ.వీ.ఆర్‌ నాయుడులను నియమించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: