నేటి సమాజంలో అభం శుభం తెలియని బాలికలపై మాటల్లో వర్ణించలేనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంధువుల బాలికలపై అత్యాచారాలు చేస్తున్న మగవారిని చూస్తుంటే మగ పుట్టకమీదే అసహ్యం పుడుతుంది. ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న మన ఈ భారతదేశంలో ఇటువంటి అసాంఘిక ఘటనలు యథేచ్ఛగా జరగటం చూస్తుంటే భవిష్యత్తులో మనం భారతీయులని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండబోదని తెలుస్తుంది.


వివరాల్లోకి వెలితే... తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ బావ, ఓ బావమరిదిల కుటుంబాలు నిజాంపేటకు వలస వచ్చి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. బావ, బామరిదిలు ఇద్దరూ వేర్వేరు అపార్టుమెంటులకు వాచ్ మేన్స్ లాగా ఉంటూ తమ కుటుంబాలని సాకుతున్నారు. అయితే బావకి ఇద్దరు కుమార్తెలు ఉండగా బామరిదికు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ పిల్లలందరి వయసు దాదాపు ఒకటే. దీంతో వారు ఒకే బడిలో ఒకే తరగతి గదిలో చదువుకునే వారు. ఒకరింటికి ఒకరు తరచూ వెళ్తూ వస్తుండేవారు. ఈ క్రమంలోనే బావ తన కూతురితో కలిసి ఆడుకునేందుకు వస్తున్న 13 ఏళ్ల బామరిది కూతురుపై కన్నేశాడు. తన పశువాంఛను ఆ బాలికపై తీర్చుకోవాలనున్నాడు. ఒకానొక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ 6 నెలల పాటు బాలికపై అనేకమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు.


అయితే గత మూడు నెలలుగా ఆ బాలికకు నెలసరి రాలేదు. అలాగే తనకి కడుపు నొప్పి వస్తుందని తరచూ తన ఇంట్లో చెప్పేది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలింది. ఇది విని నిర్ఘాంత పోయిన తల్లిదండ్రులు ఆ పని ఎవరు చేశారని బాలికను గట్టిగ నిలదీయగా... ఆమె విషయమంతా చెప్పేసింది. దీంతో తీవ్ర షాక్ కి గురైన బాలిక తల్లిదండ్రులు... తమ పక్కనే ఉంటూ తమతో పైకి మంచిగా ప్రవర్తిస్తున్న దగ్గరి బంధువే ఇటువంటి పని చేశాడని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.



ఆపై పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఏదేమైనా మనతో మంచిగా ప్రవర్తిస్తూ మన ఆడవారి పైననే కన్నేసి వారిని లోబర్చుకునేందుకు ప్రతి మగ కామాంధుడు ప్రయత్నించే అవకాశం ఉందని ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది. అందుకే ప్రస్తుత సమాజంలో ఎవరు ఎవరిని నమ్మకూడదు అని మేము సూచిస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: