గ్రేటర్ ఎన్నికల్లో తన జోరును చూపిస్తున్నారు కమలం కార్యకర్తలు. ప్రచార కార్యక్రమాలు జరుపుతూ తమ పార్టీ నేతలను గెలిపిస్తే ప్రజలకు ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తారో, ఎలా ప్రజా సేవలో నిమగ్నులై ఉంటారో చెబుతూ బిజెపి ని అధికారంలోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  తుఫాను కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇంటికో బోటు ఇస్తుంది అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై చురక విసిరారు. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు.... ఈ తరం యువత ఆలోచనా శక్తి అమోఘం. దుబ్బాకలో మా గెలుపుకి ప్రధాన కారణం యువత.. యువత మా వెన్నంటే ఉండి విజయాన్ని సొంతం చేసింది. రేపు జీహెచ్‌ఎంసీలో కూడా మా వెన్నంటే ఉండి బిజెపి గెలుపులో వాళ్లే ఉంటారు’ వాళ్ల సపోర్ట్ పొందినందుకు బిజెపి నేతలు ఎంతగానో సంతోషిస్తున్నారు.

 ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ  ప్రజల సంక్షేమం కోరే బిజెపి కార్యకర్తలను ఎన్నుకోవడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యానాలు చేశారు... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి . హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన యువత, విద్యార్థులు, మహిళలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు.... అందుకు చాలా సంతోషంగా ఉంది, మీ నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటాం అన్నారు. బిజెపి అభ్యర్థి మేయర్ అయితే ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తాం. అంతే కాదు  వరదలు రాని హైదరాబాద్ ను నిర్మించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతాం. రోడ్డు మరమ్మత్తులు చేయించు బాగు చేస్తాం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, ఫుట్ పాత్‌ల నిర్మాణం చేపడతాం’
జీహెచ్‌ఎంసీలో నీతివంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలబడతారని హామీ ఇచ్చారు  కిషన్‌ రెడ్డి.

బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా  వచ్చే వర్షాకాల సమయానికి 100 శాతం ఎవరి ఇళ్లలోకి నీళ్లు రాకుండా పునరుద్ధరిస్తాం. అందుకు తగిన చర్యలు తీసుకుంటాం.  టీఆర్‌ఎస్‌ బోట్లు కావాలా.. వరద నీరు రాకుండా పునరుద్ధరణ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పథకం అయినా కేంద్ర ప్రభుత్వ సహకారం, అండ లేకుండా అమలవడం అసాధ్యం. 169 బస్తీ దవాఖానా లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రికి, కేటీఆర్‌కి ఇదే నా సవాల్‌.. మీకు చిత్త శుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలి’ అంటూ సవాల్ విసిరారు  కిషన్‌ రెడ్డి. 2014 లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ...ఎక్కడ చూసినా తండ్రి కొడుకుల బొమ్మలతో నింపేశారు, కానీ ప్రజలకు కూడా ఆలోచన శక్తి ఉంది... ఎవరు తమకు అండగా నిలబడతారో వారికి బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: