ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే.  కొంతమంది మానవత్వం మరచి క్రూరమృగాలు గా మారిపోయి ఏకంగా దారుణంగా సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తుంటే మరి కొన్ని తెలిసీ తెలియని వయసులో చిన్న చిన్న కారణాలకు మనస్తాపం చెంది పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఇక అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసులోనే చివరికి తమ జీవితాల్ని తామే చిదిమి  వేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుని చివరి బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు ఎంతోమంది చిన్నారులు.


 తల్లిదండ్రులు మందలించారని లేదా టీచర్ తిట్టిందని..స్నేహితుల తో గొడవ జరిగిందని ఇలా చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకొని చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో కోకొల్లలుగా తెరమీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రులు బాలికను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. కానీ ఇటీవలే ఆ బాలిక తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.



 స్నేహితులు దూరం అవుతున్నారు అని ఎంతగానో బాధపడి చివరికి మనస్థాపంతో కఠిన నిర్ణయం తీసుకుంది ఏడవ తరగతి చదువుతున్న బాలిక. చివరికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపింది. ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఊరువదిలి వెళితే తన స్నేహితుల దూరం అవుతారని మనస్థాపం చెందిన   బాలిక.. ఈ క్రమంలోనే ఐ హేట్ మై లైఫ్,  అమ్మ ఐ లవ్ యు.. నాన్న అమ్మని బాగా చూసుకో అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఇక భోజనానికి పిలిచేందుకు వెళ్ళిన తల్లి విగతజీవిగా ఉరికొయ్యకు వేలాడుతున్న కూతుర్ని చూసి బోరున విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: