తన కుమార్తెను సైతం అవంతి శ్రీనివాస్ కార్పొరేటర్గా పోటీ చేయిస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవిపై కన్నేసి ఆయన తన కుమార్తెను కార్పొరేటర్గా పోటీ చేయిస్తున్నారు. నగరంలో ఆరో డివిజన్ నుంచి అవంతి కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక కార్పొరేటర్ అయితే డిప్యూటీ మేయర్ అయినా తన కుమార్తెకు ఇప్పించుకోవాలన్నదే అవంతి ప్లాన్. మేయర్ బీసీలకు రిజర్వ్ కాగా.... నగర వైసీపీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వంశీ కృష్ణ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. అందుకే అవంతి కుమార్తెను డిప్యూటీ మేయర్ చేసేందుకే కార్పొరేటర్గా నిలబెట్టారని అంటున్నారు.
అయితే అవంతి ముందు రెండు అగ్ని పరీక్షలు ఉన్నాయి. ఒకటి కుమార్తె కార్పొరేటర్ గా గెలవాలి. ఇక్కడ జనసేన బలంగా ఉంది. పైగా టీడీపీ జనసేన, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. వైజాగ్ ఉక్కు ఉద్యమం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడ పార్టీని గెలిపించడంతో పాటు అవంతి కుమార్తె కూడా గెలిస్తే రేపు డిప్యూటీ మేయర్ ఛాన్స్ ఉంటుంది. మరి అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో ? చూడాలి.