సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏ విషయమైనా కాని క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. ఇక ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఇక ఈ సోషల్ మీడియా ద్వారా అనేక రకాల మంచి పనులు జరుగుతాయి. అలాగే చెడ్డ పనులు జరుగుతాయి. దీన్ని మంచిగా వాడుకుంటే మంచి చేస్తుంది. చెడుగా వాడుకుంటే చెడు చేస్తుంది.ఇక సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అయిన వాళ్ళు వున్నారు. చాలా మంది తమ టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా నిరూపించుకున్న వారు వున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ పరువుని పోగొట్టుకున్నవారు కూడా వున్నారు. ఇక సోషల్ మీడియాలో బాగా ముందుకు దూసుకుపోతున్న సైట్ ఫేస్ బుక్. ప్రపంచంలో చాలా ఎక్కువమంది వాడే సైట్ ఇది. ఇక దీనిలో చాలా మంది అనేక విధాలుగా ప్రమోట్ చేసుకుంటారు.ఈ ఫేసుబుక్ ఖాతదారులని ఒక దేశంగా తీసుకుంటే 4 వ అతి పెద్ద దేశం అవుతుంది ఫేస్ బుక్...

ఇక అసలు విషయానికి వస్తే కొంతమంది పబ్లిషర్స్ ల టాపిక్ ని న్యూస్ లని ఈ ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు వారి అనుమతులు లేకుండా పబ్లిష్ చేసుకుంటున్నారట. ఇందువల్ల ఆ పబ్లిషర్స్ నష్టపోతున్నారు. గతంలో వారు ఆస్ట్రేలియా లో ఇలాంటి విషయం జరిగినప్పుడు వారు ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఇప్పుడు కూడా న్యూజిలాండ్ లో ఇలా రిపీట్ అయినందుకు న్యూజిలాండ్ ఫిర్యాదు చేశారంట పబ్లిషర్స్. యు ట్యూబ్ వాళ్ళ లాగానే వీరు కూడా తమ న్యూస్ వాడుకొని సంపాదించుకుంటున్నందుకు తమకు  పరిహారం చెల్లించాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారట.దీంతో ఇప్పటిదాకా ఈ ఫేస్ బుక్, గూగుల్ వారికి సంపాదించుకోవడంతో పాటు ఇప్పుడు ఖర్చు పెట్టడం కూడా తెలిసినట్లు స్పష్టం అవుతుంది...కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ సైట్స్ ముందుకు వెళ్ళాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: