సి.నారాయణ రెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట. 1931వ సంవత్సరం జులై 29వ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు మల్లారెడ్డి. తల్లి పేరు బుచ్చమ్మ. తండ్రి రైతు కాగా.. తల్లి మాత్రం ఇంటి పనులు చక్కబెట్టేవారు. సి.నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య అంతా సొంత గ్రామంలోని గవర్నమెంట్ పాఠశాలలోనే సాగింది. చిన్నతనం నుండే ఆయన జానపదాలు, హరికథలపై ఆసక్తి చూపేవారు. అలా ఆయనకు తెలుగుపై ఎనలేని మమకారం ఏర్పడింది. ఇక కరీంనగర్ లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఇక హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ కాలేజీలో 12వ తరగతి.. ఓయూలో బీఏ పట్టా అందుకున్నారు. నారాయణ రెడ్డి ఉర్దూ మీడియంలో బీఏ పూర్తి చేయడం విశేషం. అంతేకాదు ఓయూ నుండే తెలుగు సాహిత్యంలో పీజీ.. డాక్టరేట్ పొందారు. విద్యార్థి దశలోనే అనేక గ్రంథాలను చదివారు. అంతేకాదు ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం లాంటి నాటకాలు రచించి ఔరా అనిపించారు.
తొలుత సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఆ తర్వాత నిజాం కాలేజీలో లెక్చరెర్ గా విధులు నిర్వర్తించారు. అంతేకాదు ఓయూలో ప్రొఫెసర్ గా పనిచేశారు. పెద్ద పదవులు సైతం అధిరోహించారు. విశ్వంభర కావ్యం రచించి.. అందరితో భేష్ అనిపించుకున్నారు. అంతేకాదు జ్ఞానపీఠ పురస్కారం కూడా అందుకున్నారు. సి.నారాయరెడ్డి రాజ్యసభ సభ్యునిగా రాణించారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో అనేక పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1990వ సంవత్సరంలో యుగోస్లేవియాలోని నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొని తెలుగు జాతికి వన్నెతెచ్చారు.