
1982లో పార్టీ ప్రారంభించిన తొలి నాళ్లలోనే వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు కూడా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగానే ఉన్నారు. పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సహా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. దాదాపు అన్ని జిల్లాల నేతలతో కూడా గోరంట్లకు మంచి రిలేషన్ షిప్ ఉంది. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ... ఏ రోజు ఆయనకు ప్రభుత్వ పదవులు అందలేదు. ఆయన తర్వాత వచ్చిన వారికి కూడా అమాత్య పదవులు వచ్చినా... గోరంట్లకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు. అటు వయోభారం కూడా పెరగడంతో... రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఇప్పటికే చెప్పేశారు కూడా. అయితే ప్రస్తుతం పార్టీ అధినేత తనను కనీసం పలకరించలేదని... తాను స్వయంగా ఫోన్ చేసినా కూడా బదులు ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. పైగా తనపై సొంత పార్టీ నేతలే పుకార్లు పుట్టిస్తున్నారని గోరంట్ల ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నేతలు... ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదంతా పెద్ద మ్యాటర్ కాదన్నారు. ఆయన పార్టీ మారేది లేదని... ఈ వ్యవహారం అంతా కూడా అధినేత నిశీతంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా... ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ వ్యవహారంపై నోరు విప్పకపోవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ పరిస్థితుల్లో గోరంట్ల చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా... లేక... పార్టీ నేతల బుజ్జగింపులకు మెత్తబడతారా అనేది వేచి చూడాల్సిందే మరి. లెట్స్ వెయిట్ అండ్ సీ.