తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ కు గెలుపోటములు కొత్తవేమి కాదు.. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.. ఆ తర్వాత పది ఏళ్ల పాటు సీఎం గా ఉన్న కెసిఆర్.. గత సంవత్సరం ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిన ఎమ్మెల్యేల పైన ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఓడిపోవాలని.. కానీ కెసిఆర్ మాత్రం ఖచ్చితంగా గెలవాలనుకున్నారని.. ఇలా ప్రజలు అనుకోవడం వల్లే మొదటికి మోసం వచ్చిందని తెలియజేశారు.. ఇటీవలే సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమ కాలం నుంచి తమకు సెంటిమెంటుగా వస్తున్నటువంటి కరీంనగర్లో SRS కాలేజ్ గ్రౌండ్ లో ఒక సభను నిర్వహించారు.


కచ్చితంగా కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చాలా ధీమాని వ్యక్తం చేశారు.. కొద్ది రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని రైతులు రోడ్లు ఎక్కుతున్నారని బిఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందని చర్చలు ప్రజలలో మొదలయ్యాయని శాసనసభ ఎన్నికల ఫలితాలను నేతలు అసలు పట్టించుకోవద్దని ఎంపీ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని సూచించారు.. ఈ సభ తర్వాత బస్సు యాత్ర చేస్తామని కూడా తెలియజేశారు.


లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ బిజెపి పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని వచ్చేవారం కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా చేస్తామని వెల్లడించారు. మండల స్థాయిలో నేతలు పార్టీలు సమావేశం హాజరుకావాలని తెలియజేశారు..LRS ను గతంలో ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చాలా రాద్దాంతం చేశారు. ఇప్పుడు అదే LRS ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రకటించింది అంటూ కేసిఆర్ ప్రశ్నించారు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు చాలానే ఉన్నాయని ..వాళ్ల కుంపాటి వాళ్లు సర్దుకోవడానికి సమయం సరిపోలేదంటూ వెల్లడించారు ప్రజలకు కొద్ది రోజులలోనే మనం కచ్చితంగా గుర్తుకు వస్తామంటూ కేసీఆర్ వెల్లడించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: