
నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధస్సు ఆధారిత బోధనతో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇప్పుడు 33 జిల్లాల్లో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణిత బేసిక్స్లో శిక్షణ ఇవ్వనుంది. ఫిజిక్స్ వాలా ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందిస్తుంది. ఈ సంస్థ పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనుంది.
ఖాన్ అకాడమీ ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంలో వీడియో ఆధారిత శిక్షణ అందజేస్తుంది. ప్రజ్వల ఫౌండేషన్ డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్లో శిక్షణ ఇవ్వనుంది.
ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ 16 వేలకు పైగా పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించనుంది. బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ ఒప్పందాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను గణనీయంగా పెంచనున్నాయి. ఈ సంస్థల సహకారంతో విద్యార్థులకు ఆధునిక విద్య, నైపుణ్యాలు అందుతాయని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు