వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న అడుగులు రాజకీయ గాలిని ఊపేస్తోంది. తాజాగా ఆయన తన వ్యక్తిగత భద్రత కోసం సుమారు 200 మంది ప్రైవేట్ బౌన్సర్లను నియమించుకుంటున్నట్టు వార్తలు రావడం సెన్సేషన్‌గా మారింది. ఇది కేవలం భద్రత పరంగా తీసుకున్న నిర్ణయం కాదు – దీని వెనక గట్టి రాజకీయ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ప్రభుత్వ భద్రత ఉండాల్సిన అవసరం ఉన్నా, గత కొన్ని నెలలుగా జగన్ పర్యటనల్లో ప్రభుత్వ భద్రత లేకపోవడం వివాదంగా మారింది. ముఖ్యంగా రెంటపాళ్ల ఘటన, నెల్లూరు పర్యటనల్లో జగన్ ఫ్యాన్స్‌ను పోలీసులు అదుపు చేస్తూ, ఆయన భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ వివాదం మొదలైంది.
 

జగన్ కూడా అదే చెబుతున్నారు – “నాకు జెడ్ కేటగిరీ భద్రత ఉందంటున్నారు, కానీ నా చుట్టూ పోలీసులు లేరు ... రోప్ పార్టీ కూడా ఉండదు” అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం – ప్రైవేటు సైన్యం ఏర్పాటు – రాజకీయంగా కీలకంగా మారింది. ఇది ప్రభుత్వంపై నేరుగా ఒక్కొక్క బాణం. "మీరు రక్షించలేరు కాబట్టి నేనే రక్షించుకుంటా!" అనే సందేశం ప్రజల మధ్యకు పంపించడానికి ఇదొక కొత్త ప్లాన్. ఇదిలా ఉంటే అధికార టీడీపీ మాత్రం ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. జగన్ చేస్తున్న ఆరోపణలు, ప్రైవేట్ భద్రత ఏర్పాటు వెనక దాగిన రాజకీయ ఉద్దేశ్యాలపై టీడీపీ లోపల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై అధికారులను ఆదేశించినట్టు సమాచారం.


రాజకీయంగా చూస్తే, ప్రజల్లో ఓ మానవీయ కోణం రేపేందుకు జగన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. “నన్ను కూడా రక్షించడం లేదు, నా ప్రాణం హరీనవుతోంది” అనే భావోద్వేగాన్ని ప్రజల్లో నాటాలని చూస్తున్నారు. ఇది ఒకవైపు టీడీపీ ప్రభుత్వాన్ని విలన్‌గా చూపిస్తుంది, మరోవైపు జగన్‌ను బాధితుడిగా ప్రజల్లో నిలబెడుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఒక మాజీ సీఎం తనకు రక్షణ లేదంటూ ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేయడమంటే, అది అధికార వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి చర్యగా మారుతుంది. రాజకీయంగా దీని ప్రభావం ఎంత ఉందన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తానికి... జగన్ తీసుకున్న ఈ “సేన” వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చను తెరపైకి తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: