ఇటీవల స్వదేశం లో శ్రీలంక తో జరిగిన టీ 20సిరీస్ ను గెలుచుకొని ఈఏడాదిని ఘనంగా ఆరంభించిన టీమిండియా తాజాగా ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ ను కూడా గెల్చుకొని సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది. అయితే భారత జట్టుకు ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఈ సిరీస్ ల తరువాత టీమిండియా ,న్యూజిలాండ్ తో వారి సొంత గడ్డపై తలపడనుంది. అందులో భాగంగా భారత జట్టు కొద్దీ సేపటి క్రితం న్యూజిలాండ్ కు బయలుదేరింది. కాగా టీ 20సిరీస్ తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.
5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈనెల 24న ఆక్లాండ్ లో మొదటి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈపర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ టీ 20 సిరీస్ తోపాటు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కూడా తలపడనుంది.
భారత జట్టు (టీ 20సిరీస్ ) :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ,రాహుల్ , ధావన్ , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ , శివమ్ దూబే , మనీష్ పాండే , వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా , శ్రద్ధుల్ ఠాకూర్ ,షమీ ,రవీంద్ర జడేజా