కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఐసిసి టీ20 ప్రపంచ కప్ వాయిదా పడి... ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలో ప్రస్తుతం క్వాలిఫైర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులోని మొదటి మ్యాచ్లో ఒమాన్ జట్టు అలాగే పాపువా న్యూ గినియా జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాపువా న్యూ గినియాకి ఒమాన్ బౌలర్లు షాకిచ్చారు. పాపువా న్యూ గినియా ఓపెనర్లు ఇద్దరు డక్ అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన పాపువా న్యూ గినియా కెప్టెన్ అసద్ వాలా 56 పరుగులు చేసి అర్ధ శతకంతో రాణించగా.... చార్లెస్ అమిని 37 పరుగులు చేశాడు. కానీ మిగిలిన వారందరూ చేతులెత్తేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 129 పరుగులు మాత్రమే చేసింది.

ఇక ఆ తర్వాత 130 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఒమాన్ మొదటి నుండే విజయపథంలో నడిచింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు చెలరేగిపోయారు. జట్టు ఓపెనర్లు జితేందర్ సింగ్ 73 పరుగులు చేయగా... అకిబ్ ఇలియాస్ 50 పరుగులతో ఇద్దరు అర్థ శతకాలు చేసి రాణించడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఒమాన్ జట్టు పై పాపువా న్యూ గినియా కేవలం 13.4 ఓవర్లలోనే విజయం సాధించింది. దాంతో ఈ ప్రపంచ కప్ లో మొదటి విజయం నమోదు చేసిన జట్టుగా ఒమాన్ నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో పాపువా న్యూ గినియా పై నాలుగు వికెట్లు తీసిన జీషన్ మక్సూద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఈ క్వాలిఫైర్స్ లో ఒమాన్ జట్టి ముందడుగు వేసింది. చూడాలి మరి ఈ జట్టు ముఖ్యమైన టోర్నీలోకి వస్తుందా... లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: