ఇటీవల కాలంలో సరికొత్త కాన్సెప్ట్ లతో  కూడిన సినిమాలకు అటు తెలుగు ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న హీరోలు దర్శకులు కూడా సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులు ముందుకు వచ్చి చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా సినిమా చిన్నది అయినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకుపోయే విధంగా సరికొత్తగా ప్రమోషన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇలాంటి వినూత్నమైన ప్రమోషన్స్ తో ఒక సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 టాలీవుడ్ హీరో సాయి రోనాక్ హీరోగా నటించిన రాజయోగం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుంది. రామ్ గణపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ నవ బాల క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణరావు నిర్మించారు. అయితే ఇటీవల చిత్ర బృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. రాజయోగం సినిమాకు మంచి స్పందన వస్తుందని దర్శకుడు రామ్ గణపతి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా  అయినప్పటికీ ప్రశంసలు దక్కుతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.


 ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు.. అంతే కాదు ఈ సందర్భంగా ఇక ప్రేక్షకులు అందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు అని చెప్పాలి. రాజుయోగం అనే సినిమాను థియేటర్లలో చూసి నవ్వకుండా ఉండగలిగితే ఏకంగా లక్ష రూపాయల బహుమతి అందిస్తాము అంటూ ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంత నమ్మకంగా చెబుతున్నామంటే మా సినిమా మీద మాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోండి అంటూ దర్శకుడు రామ్ గణపతి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న భావన కలుగుతుందని హీరో సాయి రోనాక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: