బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ నటి దియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నవంబర్ 3న  దేశ రాజధాని దిల్లీలో తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. ఇక దీపావళి తర్వాత కాలుష్యం ఐతే  బాగా ప్రమాద  స్థాయికి చేరుకున్న సంగతి అందరికి తెలిసిందే.


 ప్రస్తుతం అక్కడ ఎయిర్ క్వాలిటీ లెవర్ 412కు చేరుకుంది . ఇది అత్యంత తీవ్ర స్థాయి. దాంతో క్రికెటర్లు కాలుష్యంతో ఇబ్బందిపడతారని మ్యాచ్ వేదిక మార్చాలని కొంత మంది మాజీ క్రికెటర్లు తెలుపుతున్నారు. ఇదే కాలుష్యంలో క్రికెటర్లు మ్యాచ్‌ ఆడితే వారి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడం జరిగింది. కానీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) మాత్రం వేదికను మార్చడానికి అస్సలు అనుమతి ఇవ్వడం లేదు. మ్యాచ్‌ అక్కడే నిర్వహిస్తామని తెలియచేసింది. దాంతో బీసీసీఐ మొండిపట్టుపై దియా మీర్జా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ట్విటర్ ద్వారా స్పందించడం జరిగింది.

‘దిల్లీలో ఎయిర్ క్వాలిటీ లెవర్ డేంజరస్ స్థాయిలో ఉందని తెలిసీ బీసీసీఐ అక్కడ మ్యాచ్ నిర్వహించాలనుకోవడం నాకు షాక్‌కు గురిచేసింది అని తెలిపింది.  ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు శ్వాసతోనే మొదలవుతుంది’ అని ట్వీట్ చేస్తూ దిల్లీ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన వివరాలను పోస్ట్ చేయడం జరిగింది.


దియాకు నెటిజన్లు కూడా మద్దతు ఇస్తున్నారు అని తెలుస్తుంది. ఇటీవల యూన్ ఎన్విరాన్మెంటల్ గుడ్ విల్ అంబాసిడర్‌గా దియా మీర్జా ఎంపిక కూడా అయంది. అప్పటినుంచి కాలుష్యంలేని ప్రకృతి కోసం ఆమె బాగా కష్టపడుతున్నారు. ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఇతరులకు అవగాహన ఇస్తున్నారు అని సమాచారం. మ్యాచ్‌కి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈలోపు బీసీసీఐ తన మొండిపట్టును వదిలి నిర్ణయం మార్చుకుంటుందో లేక క్రికెటర్ల జీవితాలను ప్రమాదంలో పడుతుందో చూడాలి మరి



మరింత సమాచారం తెలుసుకోండి: