ఇటీవల విజయ హాజరే ట్రోఫీలో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు వరుసగా సెంచరీలతో చెలరేగిపోతూ తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇక ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఏకంగా భారత యువ ఆటగాడు మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ విధ్వంసం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా 159 బంతుల్లో 220 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు 16 సిక్సర్లు ఉన్నాయి. దీన్ని బట్టి బౌలర్లపై అతడు ఎంతల వీరవిహారం చేశాడు. ఇక పరుగుల బోర్డును ఎంత వేగంగా పరుగులు పెట్టించాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి.


 అదే సమయంలో ఇటీవల విజయ హాజరే ట్రోఫీలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రూతురాజు గైక్వాడ్ ఒక ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఎంతో మంది క్రికెటర్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డును క్రియేట్ చేయగా ఇటీవల ఋతురాజు గైక్వాడ్ మాత్రం ఏకంగా ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. మధ్యలో బౌలర్ ఒక నోబాల్ వేయడంతో ఇక ఆ బంతిని  కూడా సద్వినియోగం చేసుకొని సిక్సర్ గా మలిచాడు అని చెప్పాలి.


 తద్వారా ఒక గొప్ప రికార్డును క్రియేట్ చేశాడు రుతురాజ్. అయితే ఇదే సమయంలో మరో చెత్త రికార్డు కూడా నమోదయింది అని చెప్పాలి. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివసింగ్ చెత్త రికార్డును నెలకొల్పాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్ సమయంలో 49వ ఓవర్ వేసిన శివసింగ్ ఋతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ విధ్వంసానికి బలి అయ్యాడు అని చెప్పాలి. ఇక వరుసగా ఏడు సిక్సర్లు  కొట్టడంతో ఒకేఒవర్లో 42 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 58 పరుగులు తేడాతో గెలిచిన మహారాష్ట్ర జట్టు సెమీఫైనల్ లో అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: