భారత ఫేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఐపీఎల్ లో సంచలనమైన రికార్డు నమోదు చేశాడు. అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా జయదేవ్ కి ఐపీఎల్ లో రికార్డు దక్కింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త రికార్డుగా భావించవచ్చు. జయదేవ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు ఏడు జట్ల తరఫున ఆడాడు. 2010లో జయదేవ్ మొదటి సారిగా ఐపీఎల్ లో అడుగు పెట్టగా కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత సీజన లో అంటే 2013లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం లో చేరాడు.

కేవలం ఒకే ఒక్క సీజన్ కి బెంగళూరు తో జట్టు కట్టిన జయదేవ్ ఆ తర్వాత 2014 సీజన్ కి గాను ఢిల్లీ డెవిల్స్ జట్టుకు మారిపోయాడు. ఢిల్లీ తో రెండు ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత జయదేవ్  2017  లో పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పూణే జట్టుతో కూడా ఒకే ఒక సీజన్ కి ఆడిన తర్వాత జయదేవ్ 2018లో  రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు. ఈ చెట్టులో చేరిన తర్వాత జయదేవ్ రాజస్థాన్ రాయల్స్ కి ఒక కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు మంచి ఫామ్ లో ఉండి ఆ జట్టు రాణించడంలో కీలక పాత్ర పోషించాడు దాంతో నాలుగేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తోనే కొనసాగాడు.

నాలుగేళ్ల పాటు రాజస్థాన్ జట్టు జయదేవ్ రిటన్ చేసింది. ఆ తర్వాత 2022లో జయదేవ్  మరోసారి జట్టు మారిపోయాడు. రాజస్థాన్ రిలీవ్ చేసిన వెంటనే మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధిక డబ్బుతో జయదేవ్ ని కొనుగోలు చేసింది. కానీ ముంబై ఇండియన్స్ జట్టుకి పెద్దగా ఉపయోగపడలేదు అతడు సరైన ఫామ్ లో లేకపోవడంతో ఒక ఎడాది తర్వాత ముంబై అతడిని వదిలేసింది ఆ తర్వాత లక్నో జట్టు వేళలో జయదేవ్ ని కొనుగోలు చేసింది. ఈ విధంగా అత్యధికంగా ఏడుసార్లు జట్టు మారిన ఆటగాడిగా జయదేవ్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl