బుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర పైనే కాదు వెండితెర పై కూడా తన సత్తా ఏంటో చూపితోంది.ఇక వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే తాజాగా సరికొత్త సినిమాలో నటించబోతోంది. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా వైరల్ గా మారుతుంది వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మొదటిసారిగా రంగమ్మత్త పాత్ర అయితే వెండితెరపై అలరించిన అనసూయ ఆ తర్వాత విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం యువ హీరోల సినిమాలలో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో రెండు వైపులా బాగా సంపాదిస్తోంది అనసూయ. అనసూయ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అనసూయ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త సినిమా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అనసూయ ఇదివరకే పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అద్భుతమైన నటన ను ప్రదర్శించింది. ఇప్పుడు పుష్ప-2 లో కూడా బిజీగా ఉండ బోతోంది ఈమె.ఇక ఈ చిత్రం మే కాకుండా అనసూయ నటిస్తున్న "సింబా" అనే ఒక సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలైంది. ఇందులో అనసూయ అందంగా చీర కట్టులో నుండి కోర్టు బోనులో నిలబడి ఉన్నారు. ఇక అటవీ సంరక్షణ ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మురళి మనోహర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా అనసూయ నటిస్తున్న మరో సినిమా కూడా "వాంటెడ్ పండుగాడ్ పట్టుకుంటే కోటి " ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చెయ్యగా ఇందులో అనసూయ కోయ అమ్మాయి గా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: