
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రంలో తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరికీ కోపం తెప్పిస్తుంది . దేవుడికి కూడా ఈ విధంగా చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు భక్తులు . కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా పేరుగాంచింది . ఇక్కడ స్వయంభుగా కొలువైన గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ అధికారులు కాంట్రాక్టర్లు తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి పెట్టింది . తాజాగా ఆలయ మూల విరాట్ పరిస్థితి వినాయక స్వామి వారికి క్షీరాభిషేకం చేసేందుకు భక్తులు టోకెన్ తీసుకున్నారు .
అంతా హ్యాపీగా జరిగిపోయింది ఇంకొంచెం సేపట్లో పాలాభిషేకం జరగబోతుంది అని భక్తులు భక్తి పార్వశ్యంతో ఆనందించే లోపే జరగరానిది జరిగిపోయింది . అభిషేకానికి పాలు సప్లై చేసే కాంట్రాక్టర్ భక్తులకు పాలు ఇవ్వగా అవి విరిగిపోయాయి . దుర్వాసన వస్తున్నాయి. దీంతో వారు పాడైపోయిన పాలతో స్వామి వారికి అభిషేకం చేయడం ఏంటి ..?? అని ప్రశ్నించారు . ఏం కాదు దేవుడికే కదా అని సలహాలు కూడా ఇచ్చారట . ఆ కారణంగా భక్తులు మండి పడిపోతున్నారు. మనుషులకి విలువ ఇవ్వట్లేదు దేవుడికి కూడా విలువ ఇవ్వడం లేదా ..? విరిగిపోయిన పాలతో పాలాభిషేకం నా..? ఏం మనుషులురా మీరు అంటూ సోషల్ మీడియాలో భక్తులు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . ఎప్పటినుంచి ఇలా జరుగుతుంది అని అడగ్గా పొంతనలేని సమాధానం చెబుతున్నారు . ఈ విషయాన్ని పై అధికారులు దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు . ఇప్పటికైనా ఇలాంటి వి జరగకుండా చూసుకుంటే మంచిది అంటూ సూచిస్తున్నారు . కొంతమంది అయ్యో దేవుడా నీకు కూడా ఇలాంటి దుస్థితి వచ్చిందా ..? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు..!!