వైసీపీ ప్రజాసంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. నిత్యం ఏదో ఒక పథకం పేరుతో జనం ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. ఇలా మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ వైసీపీ ఓ బుక్‌లెట్‌ రూపొందించింది. మూడో ఏడాది కూడా సంక్షేమ బావుటా పేరిట ఈ బుక్ లెట్ రూపొందించారు. ప్రభుత్వ పథకాలతో కోటి 40లక్షల కుటుంబాల్లోని 6కోట్ల 91లక్షల మందికి లబ్ది జరిగిందని ఈ బుక్‌లెట్‌ ద్వారా తెలిపారు.

మొత్తం లక్షా 36వేల 694 కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వేసినట్లు వైసీపీ తన బుక్ లెట్‌లో వివరించింది. ఈ బుక్ లెట్‌లో  ఏ పథకానికి ఎంత ఖర్చు చేసింది వివరిస్తూ 16 పేజీలతో ఈ బుక్ లెట్ ముద్రించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే కార్యక్రమాలకి సంబంధించి సంక్షేమ క్యాలెండర్ కూడా చివరి పేజీలో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: