పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తే ఇప్పటికైనా కట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. ప్రజాపోరు యాత్రలో భాగంగా ఏలూరులో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో సంక్షేమ పథకాలు అమలుచేస్తూ జగన్  సొంత పేర్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సవాల్ విసిరారు.


రాష్ట్రంలో మద్యం మాఫియా, భూ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బంగారం దొరికినంత సులభంగా ఇసుక దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రోడ్ల నిర్మాణం, గ్రామాల అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ జీరోలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఆ విషయంలో మోదీని హీరోగా అభివర్ణించారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో సర్పంచులకు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: