మైనార్టీలకు అన్నివిధాలా అండగా నిలిచింది వైసీపీ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అంటున్నారు. మైనార్టీల కోసం జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించారని... జగన్ సీఎం అయ్యాక వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇస్తున్నారని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరులో పర్యటించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొనబోతున్నారు.  ఈ ఏర్పాట్ల విషయంపై అధికారులతో సమీక్షించిన అనంతరం అంజాద్ బాష మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీలను సమావేశానికి అంజాద్ బాష  ఆహ్వానించారు. సీఎం పర్యటనను నేతలంతా కలిసి జయప్రదం చేస్తామని అంజాద్ బాష అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: