కరోనా మహమ్మారి ఊపిరితిత్తులతో పాటు మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడిన వారిలో మెదడు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు తొలి సారిగా గుర్తించారు. మెదడులోని సున్నితపైన నాడీకణాలపైనా కరోనా వైరస్‌ దాడి చేయడం వల్ల ఓ 11 ఏళ్ల బాలిక కంటి చూపు కోల్పోయినట్లు ఢిల్లీ లోని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. దేశంలోనే ఇది తొలి కేసు అయి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.


ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించిన వివరాల మేరకు.. కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఓ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యులు యాక్యూట్‌ డిమైలినేటింగ్‌ సిండ్రోమ్‌ (ఏడీఎస్‌) లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి కరోనా వైరస్‌ ప్రభావం మెదడుపైనా ఉందని నిర్ధారించారు. ఆమెకు కరోనా సోకినప్పటి నుంచి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొందన్న దానిపై ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తున్నట్లు చెప్పారు. సదరు బాలికకు కరోనా వైరస్‌ సోకక ముందు ఎలాంటి కంటి సమస్యలూ లేవని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: