స‌మాజంలో పెడ‌ధోర‌ణులు ఏవిధంగా ప్ర‌బ‌లుతున్నాయో, పురుషుడు త‌న కామ‌వాంఛ‌ల‌ను తీర్చుకోవ‌డానికి ఆకారానికి, రూపానికి స్త్రీ అయితే చాలు.. మాన‌వ మృగంగా మారిపోతున్నాడు. మాన‌వ‌జాతికే త‌ల‌వంపులు తెచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దీనికి నిద‌ర్శ‌న‌మే జార్కండ్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న అంద‌రినీ క‌లిచివేస్తోంది. ఒక యువ‌తిపై 60 మంది మ‌దోన్మాదులు అత్యాచారం చేశారు. త‌న‌కు మ‌త్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్ప‌డేవార‌ని, మాట విన‌క‌పోతే కొట్టి హింసించేవారంటూ ఓ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. క‌ర్సావా జిల్లాలోని కుంద‌ర్‌బేరా స‌మీపంలో ఒక మూత‌ప‌డిన గ్యారేజ్‌లో త‌న‌ను బంధించార‌ని తెలిపింది. మ‌రుగుదొడ్డి సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు వెళ్లాలంటూ చెప్పి త‌ప్పించుకొని వ‌చ్చిన‌ట్లు తెలిపింది. బాధితురాలు స‌రిగా మాట్లాడ‌లేక‌పోతోంద‌ని, ఎప్పుడు అప‌హ‌రించారు? ఎక్క‌డినుంచి తీసుకువెళ్లారు? అనే విష‌యాల‌ను కూడా చెప్ప‌లేక‌పోతోంద‌ని, చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: