తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అజిత్ కి మంచి మాస్ హిట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక కథారీత్యా ఈ సినిమాలో హీరో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఇక తమిళ్ లో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. ఇక తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ ని కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.అజిత్ కి లక్ష్మీ మీనన్ చెల్లెలుగా వేదాళం సినిమాలో చాలా అద్భుతంగా నటించింది. ఇక కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి సినిమాలో నట విశ్వరూపం చూపించింది. ఇక వేదాళం రీమేక్ లో కూడా కీర్తి నటన ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర బృందం భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: