![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/rahul-gandhi27da4652-c9f9-4070-924a-c6474aa509b7-415x250.jpg)
కాంగ్రెస్ పార్టీ, భారాస పార్టీలు అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలని.. భాజపా, భారాస ఒక్కటేనని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని.. కాంగ్రెస్, భారాస పార్టీలు ఎన్నికల్లో భాజపాని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ లో ఏంఐఎం ఎంపీ అసదుద్దీన్ ని ఓడిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని.. కాంగ్రెస్, భారాస పార్టీకి ఓటేస్తే వృథా అయినట్టేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డికి లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనియ్యబోమన్నారు.