ఇక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే మీకో మంచి శుభవార్త. వ్యాపారాలు చేయాలనుకునే షెడ్యూల్ కులాలు ఇంకా అలాగే షెడ్యూల్ తెగల వారితో పాటుగా మహిళలకి కూడా లోన్ ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా పథకాన్ని స్టార్ట్ చేసింది.2006 వ సంవత్సరంలో ఈ స్కీమ్ ని కేంద్రం స్టార్ట్ చేసింది.ఇక అప్పటి నుండి మార్చి 21 వ తేదీ వరకూ కూడా మొత్తం లక్ష కి పైగా లోన్స్ ని అందించింది. 2016 ఏప్రిల్ 5 వ తేదీన ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. వ్యాపారాలని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఇక ఈ పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు ఇంకా అలాగే మహిళలు ఈ స్కీమ్ ద్వారా మొత్తం 10 లక్షల రూపాయల నుండి కోటి దాకా కూడా లోన్ తీసుకోవచ్చు.బ్యాంకు కి ఒక్కరైనా సరే ఈ పథకం కింద ఖచ్చితంగా లోన్ తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సేవా రంగాలు, తయారీ రంగం ఇంకా అలాగే వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు చేసేవారు ఈ లోన్ ని తీసుకోవచ్చు.



ఇక ఈ లోన్ కి ఎవరు అర్హులు అనేది కనుక చూస్తే…18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ లోన్ ని తీసుకో వచ్చు. వ్యాపారం లో ఎస్సీ ఇంకా అలాగే ఎస్టీ వర్గాల వారు మహిళలకు కనీసం 51% షేర్ హోల్డింగ్ అనేది ఉండాలి. ఇక గతం లో లోన్ తీసుకుని వాయిదాలు కనుక చెల్లించక పోయినట్లయితే ఈ లోన్ ని ఇవ్వరు. ఇక లోన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఇండియా పోర్టల్ అయిన https://www.standupmitra.in/ ద్వారా ఈ లోన్ కు మీరు అప్లై చేయొచ్చు. లేదా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు లోన్ దరఖాస్తు కూడా పంపొచ్చు.కాబట్టి ఆలస్యం చెయ్యకుండా వ్యాపారాలు చేసుకోని ఎదగాలి అని అనుకునేవారు ఈ లోన్ కి అప్లై చేసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ లోన్ కోసం అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: