పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకోబోయే వరకు ఒకటే మాట.. అతడి భార్య ఇతడి తో ఉంది.. లేదా ఇతని భార్య అతనితో ఉంది.. క్షణకాలం పొందే సుఖం కోసం జనాలు ఎందుకు ఇంతలా ప్రాకులాడుతున్నారో అర్థం కావడం లేదు. అందుకోసం అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ సంబంధాలు మరీ దారుణం. ప్రియుడితో శారీరక సుఖానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ వనిత..


వివరాల్లోకి  వెళితే.. ప్రియుడితో సంసారానికి  భర్త అడ్డుగా ఉన్నాడని, అతని అడ్డును తొలగించాలని  భావించి ప్రియుడిని పక్కా ప్లాన్ తో ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తకపోవడం తో తానే భర్తను అతి దారుణంగా హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన  సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ అనే గ్రామంలో జరిగింది. ముత్యాలు, నాగరాణి కి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.


పిల్లలు కలిగిన కొన్ని నెలలకు ఆమె భర్తకు దూరంగా ఉంది. ఈ క్రమంలో నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త కళ్లు గప్పి చాటుమాటుగా సాగించడం కష్టమని భావించిన నాగమణి, ఆమె ప్రియుడు ముత్యాలును చంపాలని భావించారు. భర్తను ఎలా చంపాలి అనే ప్లాన్ ను ఆమె ఇచ్చింది. అనుకున్న ప్రకారం జరుగుతుందని అనుకుంది. సమయానికి ఆమె ప్రియుడు ఫోన్ తీయ్యక పోవడంతో ఆమె నిద్రపోతున్న భర్తను చున్నీతో బిగించి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపింది. ఈ విషయాన్ని తానె స్వయంగా ఒప్పుకుంది. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. పాపం పసి పిల్లలు అనాధలుగా మారారు.. చిన్న సుఖాల కోసం ఇలా చేస్తే చివరికి ఎవరికి కాకుండా పోతారని గుర్తుంచుకోవాలి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: