దేశంలో  రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. కొంతమంది ఆస్తుల కోసం హత్యలు చేస్తుంటారు. కొంతమంది భూమి కోసం హత్యలు చేస్తుంటారు. వీటితో పాటు పుట్టిన పిల్లల నుంచి ముసలి తల్లి వరకు ఎవరిని కూడా వదిలేయకుండా ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది కామ పిశాచాల చేతిలో ఎంతోమంది పిల్లలు, యువతులు బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దిశా ఘటన, ప్రియాంక రెడ్డి ఘటన దేశంలో సంచలనం రేపాయి. వీటిపై దిశ చట్టం తీసుకు వచ్చారు. అయినా  ఆ కామాంధులు కళ్లుమూసుకుపోయి  అత్యాచారాలకు పాల్పడుతున్నారు.


 ఇంకా అమానుషమైన ఘటనలు ఏమిటంటే కొన్నిచోట్ల  తండ్రి బిడ్డ పై అత్యాచారం, సోదరుడు సోదరిపై అత్యాచారం కూడా జరుగుతున్నాయి. ఆ మధ్య వరంగల్ లో చిన్నారి పాప పై అత్యాచారం ఆపై హత్య దేశమంతా కలకలం రేపింది. అది మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. అది ఏంటో చూద్దాం. 55 ఏళ్ళు  ఉన్న వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా  బయటకు వచ్చింది.
 వివరాల్లోకి వెళితే అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథ పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వ్యవసాయం, కూలి పనులు చేస్తూ ఉంటాడు.


అదే గ్రామానికి చెందిన చిన్నారికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లితో ఒంటరి గా ఉంటుంది. వారి తల్లి పొలం పనులకు వెళ్లడం చూసి, ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని మాయమాటలు చెప్పి ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆపై ఆ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. భయంతో బాలిక అరవడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు వచ్చి ఈ విషయాన్ని గమనించి  ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం  పోలీసులకు సమాచారం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: