మాకు నచ్చిన వారు అధికారంలో ఉంటేనే అనుకూలమైన వార్తలు రాస్తూ మిగతా పార్టీలు అధికారంలోకి వస్తే పూర్తిగా ఏకపక్షంగా వ్యతిరేకంగా వార్తలు రాయడంలో టీడీపీ అనుకూల పత్రికల తర్వాతనే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. రెచ్చగొట్టే వార్తలతో ఆ పెట్టుబడుల సదస్సును సరిగా నడవకుండా విషం చిమ్మే వార్తలను ఈ రెండు పత్రికలు రాస్తున్నాయి. రోజు ఎలాగో వ్యతిరేకంగా రాసే వార్తలయినప్పటికీ సమ్మిట్ నడిచే సమయంలో మరింత దూకుడును పెంచి ఇష్టారీతిన రాయడం మొదలు పెట్టాయి.


తెలంగాణ, ఆంధ్ర విడిపోయాక సదరు పత్రికల యజమానులు తమ సంస్థలను  ఆంధ్రకు ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు.  హైదరాబాద్ లో వీరి ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలకు వత్తాసు పలికే వార్తలు రాస్తూ ఆంధ్రలో మాత్రం వైసీపీ అధికారంలోకి రాగానే విషం చిమ్మే వార్తలు రాస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజల్లో విష భావజాలాన్ని నింపేందుకు ఈ రెండు పత్రికలు శాయశక్తులా కృషి చేస్తున్నాయనేవారికి కొదువ లేదు.


తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగినా మంచిని ఎలా రాశాయో.. చెడు జరిగితే దాన్ని రాయాలి. కానీ అలా రాయలేదు. వైసీపీ హయాంలో మంచి జరిగితే  రాయాలి. కానీ ఏకపక్షంగా వ్యతిరేకమైన వార్తల్నే రాస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇది సరైన జర్నలిజం అనిపించుకోదు.


పెట్టుబడుల సదస్సుకు అంబానీ, అదానీలు వచ్చినా వీరు ఏమీ రాయలేరు. గ్లోబల్ సమ్మిట్ కు ఎవరూ రావడం లేదని రాయడం మొదలెట్టారు. జనం ఒకప్పటిలాగా పత్రికల్లో వచ్చింది మాత్రమే నిజం అనుకోవడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం. నిమిషాల్లో ప్రతి సమాచారం స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రజల్లోకి చేరిపోతుంది. అందరూ అన్ని గమనిస్తున్నారు. ఒకరు విష ప్రచారం చేసినా మిగతా 100 యూట్యూబ్ ఛానళ్లు, కొన్ని వందల సోషల్ ప్లాట్ ఫాంలలో వచ్చే వార్తల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: