మన దేశానికి నష్టం జరుగుతుంది అని తెలిసినా సమర్థించే వారు కొందరుంటారు. అలాంటి లౌకిక దేశం మనది. అందుకే చైనా వాళ్లు మన భూ భాగాన్ని ఆక్రమించేదుకు యత్నిస్తుంటారు. పాకిస్థాన్ వాళ్లు మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు చూస్తుంటారు. విచిత్రమేమిటంటే వీరికి మనదేశంలో కొంత మంది మద్దతు తెలుపుతుంటారు. ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందిన ఇండియా లో అభివృద్ధి వెల్లువిరుస్తుంటే పాకిస్థాన్ లో మాత్రం మత తత్వంతో నాశనమవుతోంది.


అక్కడి హిందువుల జనాభా నానాటికి తగ్గిపోవడమే కాక.. ఉన్న వారు తీవ్ర వివక్షలను ఎదుర్కొంటున్నారు. హిందూ బాలికల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారుస్తున్న ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. 1941 పాకిస్థాన్ లో దాని జనాభాలో 42.3 శాతం  ముస్లింలు ఉండగా.. హిందువులు 51.4 శాతం, క్రైస్తవులు 2.3 శాతం, సిక్కులు 1.3శాతం, ఇతరులు 1.9 శాతం ఉన్నారు.  మత ప్రాతిపదికన ఏర్పడిన తర్వాత 1951లో ముస్లింల జనాభా 96.1శాతం కాగా హిందువుల జనాభా 1.7శాతం, క్రైస్తవులు 1.6శాతం, ఇతరులు 0.1శాతానికి పడిపోయింది. 1998కి వచ్చేసరికి 96.5 శాతం ముస్లింలు 0.9 శాతం హిందువులు, క్రైస్తవులు 2.4 శాతం మంది, ఇతరులు 0.3శాతం  ఉన్నారు. 1951, 98 జనాభాలో సిక్కులు, జైనులు లేకుండా పోయారు.


మనదేశ విషయానికొస్తే జాతీయ కమిషన్ తెలిపిన నివేదిక ప్రకారం.. జులై 1 2023 నాటికి ముస్లిం జనాభా 20 కోట్లకు చేరుకుందని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు 14.2 శాతం ఉండగా.. 2023 నాటికి అది 19.7 శాతానికి చేరుకుంది. ఓవైపు పాకిస్థాన్ లో హిందూ జనాభా తగ్గుతుంటే.. భారత్ లో ముస్లిం జనాభా పెరుగుతూ వస్తోంది.  భారత్ ను కూడా ముస్లిం దేశంగా మార్చాలని కొందరు గజ్వేహింద్, ఖలీస్థాన్ లాంటి నినాదాలు ఇస్తున్నారు.  ఏది ఏమైనా దేశం ఉక్కు కౌగిళ్ల మధ్య నలగడానికి సిద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: