ప్రస్తుత కాలంలో షుగర్ అనే వ్యాధి ఈ కారణంగా అనేక మంది రక రకాలుగా బాధ పడుతున్నారు. బిజీ లైఫ్ మరియు ఇతర ఆహార పదార్థాలు అలవాటు కారణంగా.. చాలామందికి షుగర్ వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే షుగర్ వచ్చిందో అప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... షుగర్ అదుపులో ఉంటుంది. అయితే షుగర్ అదుపులో ఉండడానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

పాలకూర జ్యూస్ : మనం ప్రతి రోజూ పాలకూర జ్యూస్ తాగితే డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్ ఉన్న వారు పాలకూర జ్యూస్ తాగితే మంచి ఆరోగ్యం. దీని కారణంగా మన శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి.

ఓట్స్ : షుగర్ తో బాధపడే ప్రతి ఒక్కరు ఓట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.  బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను ఓట్స్ మనశరీరంలో అదుపులోకి వస్తాయి. ఓట్స్ ఎక్కువగా తినడం కారణంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఆకలి అనేది తగ్గుతుంది.

ఉడికించిన కోడిగుడ్లు : షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు కచ్చితంగా ఉడికించిన కోడిగుడ్లు మాత్రమే తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ కోడిగుడ్డు అన్నం తినడం కారణంగా మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. తద్వారా షుగర్ అదుపులో ఉంటుంది.

పండ్లు : ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారు ఆపిల్, కివీ మరియు స్ట్రాబెర్రీస్ లాంటి పండ్లను తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ పండ్లు తీసుకోవడం కారణంగా డయాబెటిస్ ఉన్న వారిలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది.

గింజలు మరియు నట్స్ :  గింజలు మరియు నట్స్ తీసుకోవడం కారణంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా లాభం చేకూరుతుంది. ఎనర్జీ తో పాటు మంచి హెల్త్ ను ఇవి అందిస్తాయి. కాబట్టి  డయాబెటిస్ బారిన పడ్డవారు... కచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తే... సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: