సరోజిని అనే ఒక అమ్మకు ఐదవ తరగతి చదువుతున్న పదేళ్ళ కొడుకు దినేష్ బక్కచిక్కి మందకొడిగా ఉండటం చూసి సరోజినికి ఎప్పుడూ దిగులుగా వుండేది. భోజనం కూడా సరిగ్గా చేయక పోవడం వల్ల మరింత దిగులగా వేండేది. తన  కొడుకు అందరి పిల్లల్లాగా తెలివిగా చురుకుగా వుండాలని ఎవరెవరి సలహా మీదనో ఏవేవో టానిక్కులు మందులు తెచ్చి ఇచ్చేది.  ఇకసారి ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం బలవర్థకమైన  కాయగూరలు, ఆకుకూరలు వండి భోజనంలో వడ్డించి పెట్టింది. వాటిని చూసిన దినేష్ ‘‘ఈ ఉడకేసిన కూరలు తిననంటే తినను నాకు ఇష్టంలేదంతే’’ అని కచ్చితంగా చెప్పేశాడు. సరోజిని కొడుకుతో ‘‘ చూడు బాబూ ! ఇప్పుడు నువ్వు ఐదోతరగతి చదువుతున్నావు. ఈ కాయగూరలు, ఆకు కూరలు ఎటువంటి ఆరోగ్యాన్నిస్తాయో నీకు తెలీదు. వచ్చే సంవత్సరం ఆరోవ తరగతికి వెళ్తే మీ టీచర్ ఆరోగ్యశాస్త్రంలో వీటి విలవ చెబుతుంది. అది విని నువ్వే ఆశ్చర్యపోతావు’’ అంది. తల్లితో ‘‘ అమ్మా ! వచ్చే సంవత్సరం నేను టీచర్ ద్వారా తెలసుకుని అప్పుడు తింటాను. ఇప్పుడు మాత్రం ప్రతిరోజు వంటలు వెబ్ సైట్ లోని  పిండివంటలలో ఆంటీలు చేసినట్లుగా నాకిష్టమైన వంటలు చేసి పెట్టు’’ అన్నాడు దినేష్.  

మరింత సమాచారం తెలుసుకోండి: