
దీనికోసం ముందుగా ఒక స్టవ్ పై ఒక బాండీ పెట్టి, అర లీటర్ నీరు పోసి,ఇందులో రెండు నుంచి మూడు వరకు యాలకులు,ఇంచు దాల్చిన చెక్క,రెండు టీ స్పూన్ల ధనియాలు,రెండు మూడు లవంగాలు వేసి బాగా ఉడికించుకోవాలి.ఇది బాగా ఉడికి రంగు మారిన తర్వాత స్టవ్ పై నుంచి దింపి చల్లారనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడే,అందులో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి రోజు పరగడుపున ఆస్వాదిస్తూ తాగాలి.
ఇందులో ఉన్న స్పైసస్ కి రోజంతా యాక్టివ్ గా ఉంచి , మెదడులోని కణాలను సెట్ చేసి,అనవసరమైన ఆలోచనలు కలగకుండా చేసే గుణాలు ఉంటాయి.కొన్ని రకాల ప్లేవర్ లు మన మనసును,మెదడును శాంతపరచడమే కాకుండా,కొత్త ఆలోచనలు కలిగేందుకు దోహదపడతాయి.కావున మీరు కానీ, మీ చుట్టూ ఉన్నవారు కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నాట్లయితే ఈ టీ తప్పక తీసుకోవడం అలవాటు చేసుకోండి.దీనితో పాటు యోగా, వాకింగ్, రోజు ఏదొక కొత్త పనిచేయడం,నలుగురితో కలిసి మాట్లాడటం వంటి వాటితో ముడీనెస్ కి గుడ్ బై చెప్పొచ్చు.