థాయ్‌లాండ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన మిస్ యూనివర్స్–2025 ప్రపంచ సౌందర్య పోటీలలో ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటం మెక్సికో ప్రతినిధి ఫాతిమా బాష్కు దక్కింది. అద్భుతమైన నడక, విశ్వాసభరితమైన సమాధానాలు, స్టేజ్‌పై చూపించిన కరిష్మాతో ఆమె న్యాయనిర్ణేతలను ఆకర్షించి తుది రౌండ్‌లో విజేతగా నిలిచారు.గతేడాది మిస్ యూనివర్స్‌గా కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ సౌందరి విక్టోరియా కెజార్ హెల్విగ్ ఈ సారి స్టేజ్‌పై ప్రత్యక్షమై ఫాతిమాకు ప్రతిష్టాత్మకమైన విశ్వ సుందరి కిరీటం అలంకరించారు. అరేనాలో కిరీటం దక్కిన వెంటనే ఫాతిమా భావోద్వేగాలకు లోనై, తన దేశం మెక్సికో కోసం ఈ గౌరవం ఎంతో ప్రత్యేకమని తెలిపారు.


ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్ ఎంపికయ్యారు. స్వదేశ వేదికపై నిలబడి ప్రపంచ స్థాయిలో రన్నరప్ టైటిల్ దక్కించుకోవడం ఆమెకు గర్వకారణంగా మారింది. రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసాలి నిలిచారు. సౌందర్య పోటీల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వెనెజువెలా ఈసారి కూడా టాప్ స్థానం దక్కించుకోవడంలో విజయవంతమైంది.భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొన్నారు. స్టేజ్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్, స్విమ్‌సూట్ రౌండ్‌లో ఆమె అద్భుతంగా రాణించి టాప్ 30 వరకు చేరుకున్నారు. అయితే టాప్ 12లో స్థానం సంపాదించలేకపోవడంతో ఈ ఏడాది భారత్‌కు కిరీటం దక్కలేదు. అయినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిభను ప్రదర్శించిన మణికా ప్రదర్శనకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.



అందాల పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలు పాల్గొన్న ఈ మహా ఈవెంట్‌ అపారమైన సందడి, ఘనత, గ్లోబల్ గ్లామర్‌తో సాగింది. నైపుణ్యం, సమాజ సేవ, వ్యక్తిత్వం, ప్రతిభ ఆధారంగా జరిగిన ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రపంచం నలుమూలల సౌందర్యం, సంస్కృతులు, ప్రతిభలకు వేదికగా నిలిచిన మిస్ యూనివర్స్–2025 కార్యక్రమం అన్ని దేశాల్లో విశేష చర్చనీయాంశంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: