ఇక బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత కూడా శ్రీముఖి వరుసగా షో లు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ప్రస్తుతం వరుస షోలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ సినిమా ఈవెంట్ లో చూసినా శ్రీముఖి కనిపిస్తుంది. అయితే మొన్నటి వరకు భాను శ్రీ, యాంకర్ రవి కలిసి హోస్టింగ్ చేసిన బొమ్మ అదిరింది షోకి ఇటీవలే శ్రీముఖి యాంకర్ గా వచ్చిన విషయం తెలిసిందే. తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీముఖి.
కాగా ఇటీవలే జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ ప్రోమో ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాగా ఈ ప్రోమో లో భాగంగా చంద్ర స్కిట్ చేస్తున్న సమయంలో... శ్రీముఖి బోల్డ్ కామెంట్స్ చేస్తుంది. వృద్ధురాలి వేషం వేసుకుని చంద్ర స్కిట్ చేస్తున్న సమయంలో తాత చనిపోయాడు కదా మరి చాలా రోజుల అయినట్టుంది అంటూ... కాస్త బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. దీంతో అందరూ నవ్వుకుంటారు. ఇక స్కిట్ జరుగుతున్న సమయంలోనే... బొమ్మ అదిరింది షో కి గెస్ట్ గా వచ్చిన బండ్ల గణేష్ చాలా గ్యాప్ వచ్చినట్టుంది అంటూ కామెంట్ చేస్తాడు. కాగా ఈ ప్రోమో ప్రసాదం వైరల్ అవుతుంది.