ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్న టాలీవుడ్ కథనాయికల్లో రష్మీక మందన్న కూడా ఒకరు. స్వతహాగా కన్నడ భాషకు చెందిన ఈ భామ తొలిసారిగా అక్కడ కిరిక్ పార్టీ అనే మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగులో ఛలో మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రష్మీక, ఇక్కడ ఫస్ట్  మూవీ సక్సెస్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది.
దాని అనంతరం గీత గోవిందం, సరిలేరు నికెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న రష్మీక, ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మరిపోయింది. అలానే అటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా వరుసగా ఛాన్స్ లతో కొనసాగుతోంది రష్మీక మందన్న. ప్రస్తుతం తెలుగులో ఆమె శర్వానంద్ తో అడాళ్లు మీకు జోహార్లు, అలానే అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
అయితే రష్మీక కి ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె మాత్రం ఎంతో జాగ్రత్తగా ఆచి తూచి వాటిని ఎంచుకుంటూ కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. కాగా రష్మీక కి సంబందించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు అయ్యప్పనుమ్ కొషియం తెలుగు రీమేక్, అలానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వాటి అనంతరం సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రాం తాళ్లూరి నిర్మాతగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ గా తెరకెక్కనున్న ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా రష్మీక మందన్న ఫిక్స్ అయిందని, రెండు రోజుల క్రితం ఆమెని యూనిట్ కన్ఫర్మ్ చేసిందని అంటున్నారు. అలానే దీనికి సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం రష్మీక, పవర్ స్టార్ సరసన సూపర్ ఛాన్స్ పట్టేసినట్లే అని అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: