ప్రతిరోజు మనల్ని బుల్లితెరపై ఎంతోమంది నటి నటులు అలరిస్తున్న విషయం తెలిసిందే.వెండితెరతో  సమానంగా బుల్లితెరకు కూడా మంచి డిమాండ్ ఉంది.సినిమాల్లో మాదిరిగానే బుల్లితెర  మీద కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన చాలా మంది నటులు ఉన్నారు. మరి ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చి బుల్లితెరలో రాణిస్తున్న నటులు ఎవరో చూద్దామా.ఈ లిస్ట్ లో ముందుగా వచ్చే పేరు ఓంకార్.  తెలుగు సినిమా రచయితగా, నటుడిగా రాణించి,బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇప్పుడు ఆయన కొడుకు అయిన నిరుపమ్ పరిటాల హవా నడుస్తుంది. ఈ టీవిలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇప్పుడు డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్ లో చేస్తున్నాడు. ఇతడి భార్య మంజుల కూడా చంద్రముఖి సీరియల్ లో నటించి, ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో చేస్తోంది. అలాగే మంజుల చెల్లెలు కీర్తి కూడా హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో చేస్తోంది. కీర్తి భర్త జై దనుష్ కూడా టివి నటుడే.ప్రస్తుతం నెంబర్ వన్ కోడలు సీరియల్ లో హీరోగా చేస్తున్నాడు.


మొగలి రేకులు, ఋతురాగాలు వంటి సీరియల్స్ లో నటించిన శృతి సింగంపల్లి ప్రస్తుతం నాగభైరవి సీరియల్ లో చేస్తోంది. ఈమె తల్లి నాగమణి కూడా చక్రవాకం వంటి కొన్ని సీరియల్స్ లో నటించింది.అలాగే శృతి భర్త మధుసూదన్ కూడా టివి నటుడే. మొగలి రేకులు,చక్రవాకం వంటి సీరియల్స్ లో చేసాడు.ఎన్నో సినిమాల్లో నటించిన సన తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో చేసింది. ప్రస్తుతం అరవింద సమేత సీరియల్ లో చేస్తోంది. సన కొడుకు సయ్యద్ అన్వర్ కూడా ఇదే సీరియల్ లో నటిస్తున్నాడు. సన కోడలు, అన్వర్ భార్య సమీరా ఎన్నో సీరియల్స్ లో చేస్తోంది. అందులో భార్యామణి సీరియల్ ఒకటి. అంతేకాదు, అత్తా, భర్త నటిస్తున్న అరవింద సమేత సీరియల్ లో కూడా సమీరా నటిస్తోంది. వైష్ణవి రామిరెడ్డ్డి పలు తెలుగు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం దేవత సీరియల్ లో చేస్తోంది. వైష్ణవి రెడ్డి తండ్రి సీరియల్ డైరక్టర్. వైష్ణవి రెడ్డి చెల్లెలు దుర్గ ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ లో నటిస్తోంది. వైష్ణవి రెడ్డి తమ్ముడు విజయసింహ కొన్ని సీరియల్స్ నటించాడు. యాడ్స్ లో చేసాడు.

ప్రముఖ యాంకర్ సుమ కూడా మొదట్లో సీరియల్ నటిగా వేయి పడగలు, గీతాంజలి వంటి ఎన్నో సీరియల్స్ చేసింది.తరువాత యాంకర్ గా స్థిర పడిపోయింది.సుమా భర్త ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా ఎన్నో సీరియల్స్ లో చేసాడు. అలాగే వల్లభనేని శిరీష స్టార్ మాలో చెల్లెలి కాపురం సీరియల్ లో చేస్తోంది.వీళ్ళు మొత్తం ముగ్గురు అక్క్కచెళ్లెల్లు. అందరు కూడా సీరియల్స్ నటిస్తున్నారు.ఒక సోదరి రజిత  జీ తెలుగులో ప్రసారమయ్యే ఇంటిగుట్టు సీరియల్ లో చేస్తోంది. శిరీష రెండవ అక్క సౌజన్య కూడా సప్తమాతృక అనే సీరియల్ లో నటించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: