వరస పరాజయాలతో సతమతమైపోతున్న అఖిల్ తన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ మే 2019 లో ప్రారంభం అయింది. ఇప్పటికి ఈ సినిమా ప్రారంభం అయి 27 నెలలు పూర్తి అవుతున్నా ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న వార్తలు తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.


తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రీ షూట్ మళ్ళీ జరుగుతున్నట్లు టాక్. దీనితో ఈ మూవీ రీ షూట్ ఎన్ని సార్లు జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ క్రితం సంవత్సరం సమ్మర్ రేస్ కు వస్తుందని అనుకున్నారు.


కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అయిపోయి థర్డ్ వేవ్ వచ్చేస్తున్నా ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం ఈ మూవీ నిర్మాతలకు తెలియదు అనుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ షూటింగ్ లోకి నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రవీంద్రన్ చిన్మయి లు జంటగా ఎంటర్ అయినట్లు టాక్.


ప్రస్తుతం వీరిద్దరి పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీలో వీరిద్దరికీ ప్రాధాన్యత ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఓటీటీ లో విడుదల అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీకి మళ్ళీ రీషూట్ అంటూ వార్తలు వినిపిస్తూ ఉండటంతో అసలు ఈ సినిమా ధియేటర్లలో విడుదల అవుతుందా లేకుంటే ఓటీటీ లోకి వస్తుందా మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి.  ప్రస్తుతం అఖిల్మూవీ పై తన దృష్టిని తగ్గించి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్’ మూవీ పై ఆశలు పెంచుకుంటున్న పరిస్థితులలో మోస్ట్ ‘ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: