మన తెలుగు సినిమా నటులతో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సహా ఆయన ఫ్యామిలీ లోని నటులు అందరికీ మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. కన్నడ నాట రాజ్ కుమార్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన తనయులు కూడా ప్రస్తుతం కన్నడ లో హీరోలుగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వారిలో ప్రస్తుతం పవర్ స్టార్ గా యువత మనసులు దోచుకుని తిరుగులేని పాపులారిటీ తో కొనసాగుతున్న పునీత్ రాజ్ కుమార్ మన తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయం ఉంది.

కన్నడలో పునీత్ హీరోగా తెరకెక్కిన అప్పు మూవీ సూపర్ హిట్ కొట్టగా, దానిని తెలుగులో రవితేజ తో ఇడియట్ పేరుతో తీశారు. కాగా ఆ రెండు సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ దూకుడు సినిమాని అక్కడ పవర్ పేరుతో పునీత్ రీమేక్ చేయగా అది అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టింది. నిజానికి ఎప్పటినుండో తనకు పునీత్ రాజ్ కుమార్ తో మంచి అనుబంధం ఉందని, పవర్ మూవీ ఆడియో ఫంక్షన్ లో పునీత్ ని చూసిన తనకు నిజంగా ఎంతో ఆశ్చర్యం వేసిందని అన్నారు మహేష్. ఎంత ఎదిగినప్పటికీ కూడా వారి తండ్రి రాజ్ కుమార్ గారి దగ్గరి నుండి పునీత్ వరకు అందరూ కూడా సాధారణ వ్యక్తుల వలె వ్యవహరిస్తుండడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో మహేష్ పునీత్ పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడారు.

ఆ విధంగా మహేష్ తో పునీత్ కి మంచి అనుబంధం ఉంది. ఇక నేడు గుండె నొప్పి తో హాస్పిటల్ లో చేరిన పునీత్ రాజ్ కుమార్ ఒక్కసారి మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమ తో పాటు యావత్ సినిమా ప్రేక్షకులు అందరినీ కూడా ఎంతో కలిచి వేస్తోంది. ఆ సందర్భంగా పలువురు తెలుగు ప్రేక్షకులు సైతం ఆయనని గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటూ సోషల్ మీడియా లో మెసేజెస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: