సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమా పై మహేష్ అభిమానులు ఎన్నో అశలు పెట్టుకున్నారు.నిజానికి 2022 సంక్రాంతికే ఈ సినిమా వస్తుందనుకున్నారు కానీ పరిస్థితులు సహకరించకపోవడం వలన సినిమా రాలేదు. అయినా కాని ఫిబ్రవరి నెలలో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు.మొదటి పాట కోసం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ ను తృప్తి పరుస్తున్నారు.ఇక తాజాగా కీర్తి సురేష్ ఇంకా మహేష్ బాబు లకి సంబంధించి ఓ రొమాంటిక్ పోస్టర్ ను కూడా వదిలారు. 'కళావతి' అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన', 'వకీల్ సాబ్' లోని మగువా మగువా పాటల్ని మించేలా ఈ పాట ఉండాలని.. కచ్చితంగా ఈ పాట యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ కొట్టి సరి కొత్త రికార్డు సృష్టించాలని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.

అందుకోసం సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు చాలా  అంటే చాలా అలెర్ట్ గా ఉన్నారు.అయితే ఇన్సైడ్ సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్ ఆశించిన స్థాయిలో లేదు అనేది తెలుస్తుంది. అందుకోసమే ఈ పాట కోసం ఇంతలా ప్రమోషన్స్ మొదలుపెట్టారు అని సమాచారం తెలుస్తుంది. అయితే సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడాడు కాబట్టి.. ఇక ఈ పాట ఎలా ఉన్నా జనాలు ఎక్కువగా వినే ఛాన్స్ లు ఉన్నాయి. పైగా వాలెంటైన్స్ డే స్పెషల్ అంటున్నారు కాబట్టి ఈ కళావతి పాట కోసం అందరూ ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఒకవేళ కనుక ఈ ఫస్ట్ సింగిల్  హిట్ అయితే 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నట్టే..! తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: