ఇక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటాయి. సెలబ్రిటీస్‌ అయితే ఇక ఇందుకు అతీతం కాదు. ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్‌ కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నారట.పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ మలయాళ కుట్టి చాలా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నటి అని ఈజీగా చెప్పొచ్చు. ఏ విషయాన్ని అయినా కూడా ఆమె కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం, తెలుగు ఇంకా అలాగే తమిళం భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఇంకా అలాగే విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన మలయాళ చిత్రం కూడా ఇటీవల విడుదలైంది.ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నిత్యామీనన్‌ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను కూడా గుర్తు చేసుకుంది. తనను ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా ఎన్నో వేధింపులకు గురి చేశారని చెప్పింది. 


నటుడు మోహన్‌లాల్‌ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్‌ వర్గీ అనే ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి చాలా ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది.ఇక చాలా మంది కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది.అలాగే సంతోష్‌ తనను చాలా రకాలుగా అన్‌ పాపులర్‌ చేశాడని, ఇక చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని కూడా పేర్కొంది. తన గురించి సంతోష్‌ చెప్పేవన్నీ కూడా అసత్యాలని వాటిని అసలు ఎవరూ నమ్మవద్దని కోరింది. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో హీరో ధనుష్‌కు జంటగా నటిస్తున్న తిరు చిట్రంబలమ్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇటీవల నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: