తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో పేపర్ బాయ్ మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టి ఏక్ మినీ కథ మూవీ తో మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఏక్ మినీ కథ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే సంతోష్ శోభన్ ఆఖరుగా మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి మారుతీ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ శోభన్ "లైక్ షేర్ సబ్స్క్రయిబ్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ,  మేర్లపాక గాంధీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన విడుదల చేనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ను అక్టోబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: