నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టే పనిలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఆ తరువాత చేయబోయే సినిమాల గురించి కూడా ఓవైపు పని చేస్తున్నారు అందులో భాగంగానే అనిల్ రావిపూడి తో ఆయన తదుపరి సినిమా చేయబోతూ ఉండగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదలుపెట్టాలని ఆయన భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ తరువాత సినిమాలు చేయడానికి చాలా మంది యువ దర్శకులు ఎదురుచూస్తున్నారు అలా ఆయనతో సినిమాలు చేసే దర్శకుల జాబితా రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పాలి. అనిల్ రావిపూడి సినిమా తర్వాత ఏకంగా ముగ్గురు దర్శకులు ఈ హీరోతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు వారందరూ కూడా యువ దర్శకులు హిట్ దర్శకులు కావడం విశేషం భీష్మ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా శిఖర్లు చేస్తున్నాయి.

ఆయన మాత్రమే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి బాలకృష్ణ చేయబోయే సినిమా కోసం దర్శకుడుగా పరుశురామ్ ఎంపిక అయ్యాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరు మాత్రమే కాకుండా వెరైటీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడైన ప్రశాంత్ వర్మ కూడా నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే ఈ హీరోతో కథను చెప్పి ఒప్పించే పనిలో పడ్డాడట. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి దర్శకులతో నందమూరి బాలకృష్ణ ఎవరితో సినిమాను ఓకే చేస్తాడో అన్న విషయం ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. అఖండ సినిమా విజయం తరువాత ఆచితూచి అడుగులు వేస్తున్న నందమూరి బాలకృష్ణ స్క్రిప్ట్ విషయంలో మంచి వైవిధ్యత ప్రదర్శిస్తే ఆయనతో సినిమా చేయడం పెద్ద విషయమేమీ కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: