ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పూర్తి చేసి సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే , శ్రీ లీల ను ఎంపికైన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ రావడం గమనార్హం. ఇందులో మూడవ హీరోయిన్ గా భూమి పడ్నేకర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటే ముగ్గురు హీరోయిన్లు అన్నట్టుగా మార్కు పడిపోయే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా.. నిత్యామీనన్ , ఆదాశర్మ, సమంతాలు హీరోయిన్లుగా నటించి మెప్పించారు.
ఆ తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో కూడా సమంత, కాజల్ , ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్లతో సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పూజ హెగ్డే, శ్రీ లీల, భూమి పడ్నేకర్ లను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇక రాబోయే త్రివిక్రమ్ సినిమాలలో తప్పకుండా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తీసిన ఈ చిత్రాలలో సన్నాఫ్ సత్యమూర్తి పర్వాలేదు అనిపించుకుంది. కానీ బ్రహ్మోత్సవం సినిమా బోల్తా కొట్టింది. మరి ఈ సినిమా అయినా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.