ఈ ఏడాది ఆరంభంలోనే 'వాల్తేరు వీరయ్య' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ మూవీతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన చిరు వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'బోళా శంకర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.? కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు తాజాగా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైపోయాయి. అలా చిరంజీవి ఏడాదికి రెండు సినిమాలను ఫ్యాన్స్ కి అందించేలా ప్లాన్ చేస్తున్నాడు. 

ఇందులో భాగంగానే చిరు తాజాగా బింబిసార డైరెక్టర్ వశిష్ట, జవాన్ డైరెక్టర్ బి వి ఎస్ రవి దర్శకత్వంలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని చెబుతున్నారు. అయితే మెగాస్టార్ మాత్రం ప్రస్తుతం తన కూతురు సుస్మిత కెరీర్ని సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్లను నిర్మించింది సుష్మిత. అయితే ఆ వెబ్ సిరీస్ లు ఈమెకు నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో నిర్మాతగా సుస్మిత ను గట్టెక్కించేందుకు మెగాస్టార్ స్వయంగా రంగంలోకి దిగాడట.

అలా తన కూతురు కోసం ఓ మూవీ చేయాలని డిసైడ్ అయిన చిరంజీవి కథలను సైతం వింటున్నాడట. ఈ క్రమంలోనే మెగాస్టార్ దృష్టిలో ముగ్గురు దర్శకులు ఉన్నారని అంటున్నారు. వాళ్లలో ఒకరు వెంకి కుడుముల కాగా మరొకరు తమిళ్ దర్శకుడు పీఎస్ మిత్రన్.. మరోదర్శకుడు సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ. ఇటీవల ఈ ముగ్గురు దర్శకులు చెప్పిన స్టోరీ లైన్స్ మెగాస్టార్ కి నచ్చడంతో వాటిని ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చేయాలని చెప్పారట. ఈ ముగ్గురు డైరెక్టర్ల లో ఎవరు ఫుల్ స్క్రిప్ట్ తో మెగాస్టార్ ని మెప్పిస్తారో ఆదర్శకుడితో తన కూతురు సుష్మిత బ్యానర్ పై సినిమా చేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యారట. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఏ దర్శకుడు చిరంజీవిని మెప్పిస్తారో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: