టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈమె మోడల్, నటి.  ప్రస్తుతం పూజా రెట్రో మూవీలో సూర్యకి జంటగా నటిస్తుంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది. ఈ బ్యూటీ అందం గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఎంతైనా మిస్ యూనివర్స్ కదా. ఈ సందర్భంగా అందాల భామ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. తానని తెలుగు సినీ పరిశ్రమనే నటిగా తీర్చిదిద్దిందని చెప్పింది. అందువల్లే తానకి ఇప్పుడు హిందీ సినిమాలలో పాత్రలను ఎంచుకునే అవకాశం వచ్చిందని తెలిపింది. సినీ ప్రయాణంలో పూజా హెగ్డే ఎన్నో అనుభవాలను ఎదురుకుందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తన అభిప్రాయం చెప్పడానికి భయపడేది.. ఇప్పుడు దైర్యంగా చెప్తున్నానని ఆమె అన్నారు.  

పూజా 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది. ఆతర్వాత పూజ రాధేశ్యామ్‌‌, బ్యాచిలర్, దువ్వాడ జగన్నాధం సినిమాలలో కూడా నటించింది.

పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. రెట్రోతో పాటుగా ఈమె కూలీ, కాంచన 4 సినిమాలలో కూడా నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: