జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో  నిన్నటి రోజున జరిగిన ఉగ్రదాడి గురించి ఎన్నో వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయంశానికి దారితీస్తున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన టిఆర్ఎస్ ఉగ్రవాదులను సైతం చట్టం ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రకటించారు. అయితే తాజాగా ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. అసలు ఉగ్రవాదులు పహాల్గాం అడవులలో పర్యటన స్థలానికి ఎలా చేరుకున్నారని? అక్కడ కాల్పులు చేయడానికి గల కారణం ఏంటి? అయితే వీళ్ళు ఆ ప్రదేశానికి ఏ యాప్ సహాయపడిందనే విషయంపై ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.


అయితే వీరికి సహాయపడినది ఆల్ఫైన్  క్వెస్ట్ అనే యాప్ ను ఉపయోగించి వచ్చినట్లుగా ఇంటిలిజెన్స్ భద్రత వర్గాలు తెలియజేస్తున్నాయి.గతంలో కూడా జమ్మూ అడవులలో ఇలాంటి దాడి చేసి సమయంలో ఉగ్రవాదులు ఈ యాప్ ని ఉపయోగించారట. ఇప్పుడు కూడా మళ్లీ ఇదే యాప్ ద్వారానే రద్దీగా ఎక్కడ పర్యటన ప్రాంతం ఉంటుందో అక్కడ గుర్తించిన ఉగ్రవాదులు అక్కడ అటాక్ చేశారట. అయితే ఈ యాప్ ని ఎక్కడ ట్రాకింగ్ చేయకుండా ఫాక్ సైన్యం మద్దతుతోనే రూపొందించారట.


అయితే ఈ యాప్ ని ఉపయోగించడానికి కూడా ఇలాంటి దాడులు చేయడానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఆ తర్వాతే పక్క ప్లానింగ్ తో ఇలాంటి  దాడులకు పాల్పడుతున్నారని తెలియజేశారు. పహల్గామ లోని దాడి చేసిన ఘటనలు 25 మంది పర్యటకులు మరణించక మరొక 20 మందికి గాయాలు అయ్యాయి ఈ ఉగ్రవా దాడి అనంతరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతికారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ పైన పలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నది.. ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందం ఆపివేయడమే కాకుండా భారత్, పాక్ మధ్య రాకపోకల కోసం గుండె చెక్పోస్ట్ ను కూడా మూసివేశారు. పాకిస్తాన్ వీసాలను కూడా నిషేధించేలా కఠిన చర్యలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: