టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీతో పటు మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే..రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వంచరస్ థ్రిల్లర్‌లో నటించేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నారు.ఇప్పటికే అఫీషియల్‌గా ఎనౌన్స్‌ అయిన ఈ మూవీ గురించి రకరకాల వైరల్‌ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు కూడా రాకపోయినా మహేష్ – రాజమౌళి మూవీకి సంబంధించి రకరకాల వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ లో హీరో క్యారెక్టర్ హనుమంతుడి తరహాలో ఉంటుందన్నది ఓ అదిరిపోయే న్యూస్‌. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌ జాన్వీ అని కూడా మరో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. అయితే అదంతా ఒట్టి గాసిప్పేనన్నది రాజమౌళి కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న మాట.ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.


భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీని పై క్లారిటీ ఇచ్చారు రైటర్ విజయేంద్రప్రసాద్.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం వేసవి కంటే ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే షూటింగ్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి క్యాస్టింగ్ సెలక్షన్ పనిలో ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి మూవీ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వనున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ సినిమా ఖచ్చితంగా పాత రికార్డులు బద్దలు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని సూపర్ స్టార్ అభిమానులతో పాటు మిగతా హీరోల అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: